దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. గతకొన్ని రోజులతో పోల్చితే రోజువారీ కరోనా కేసులు నమోదు కొంత తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 13,734 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,40,50,009 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 34 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,26,430 కి పెరిగింది. దీంతో దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం లక్ష 39 వేలుకుపైగా (1,39,792 (0.32%)) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కొత్తగా 17,897 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,33,83,787 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.49 శాతంగానూ, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది.
ముఖ్యంగా గత 24 గంటల్లో తమిళనాడు (1359), కేరళ (1321), కర్ణాటక (1287), హిమాచల్ ప్రదేశ్ (859), మహారాష్ట్ర (830), ఢిల్లీ (822), ఒడిశా (797), తెలంగాణ (771), గుజరాత్ (606), హర్యానా (600) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఆగస్టు 2, మంగళవారం ఉదయం 7 గంటల వరకు 204.60 కోట్లకుపైగా (2,04,60,81,081) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని వెల్లడించారు. ముందు రోజున 26,77,405 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY