దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,52,734 కరోనా పాజిటివ్ కేసులు, 3128 మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,80,47,534 కు చేరుకోగా, మరణాల సంఖ్య 3,29,100 కి పెరిగింది. కాగా గత కొన్ని రోజులతో పోల్చితే రోజువారీ కరోనా కేసుల నమోదు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. వరుసగా 18వ రోజూ కూడా కొత్త కేసులకంటే రికవరీలు ఎక్కువుగా నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు మాత్రం పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి.
దేశంలో కరోనా రికవరీ రేటు 91.60 శాతం, మరణాల రేటు 1.17 శాతం:
ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా, అస్సాం, పంజాబ్, రాజస్థాన్ వంటి 10 రాష్ట్రాల్లోనే గత 24 గంటల్లో కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అయ్యాయి. ఇక దేశంలో ప్రస్తుతం 20,26,092 (7.22%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరో 2,38,022 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 2,56,92,342 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 91.60 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.17 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (మే 31, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 34,48,66,883
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 2,80,47,534
- కొత్తగా నమోదైన కేసులు [మే 30– మే 31 (8AM-8AM)] : 1,52,734
- నమోదైన మరణాలు : 3128
- రికవరీ అయిన వారి సంఖ్య : 2,56,92,342
- యాక్టీవ్ కేసులు : 20,26,092
- మొత్తం మరణాల సంఖ్య : 3,29,100
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ