దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 15,754 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 19, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,43,14,618 కు చేరుకుంది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 3.47 శాతంగా నమోదైంది. అలాగే కరోనాతో మరో 47 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,27,253 కి పెరిగింది. ఇక ఆగస్టు 18, గురు వారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 88.18 కోట్లకు (88,18,73,052) చేరుకుంది. ఆగస్టు 18న 4,54,491 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
దేశంలో 1,01,830 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.58 శాతం:
దేశంలో ప్రస్తుతం 1,01,830 (0.23%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 15,220 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,36,85,535 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.58 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, తెలంగాణ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY