దేశవ్యాప్తంగా నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేస్తూ, “జన్మాష్టమి శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీకృష్ణుని జీవిత లీల ప్రజల సంక్షేమం కోసం నిస్వార్థ కార్యాలు చేయాలని బోధిస్తుంది. ఆలోచన, మాట, చేతలతో అందరి అభిరుచికి ప్రాధాన్యత ఇచ్చేలా ఈ పవిత్ర పండుగ మనందరికీ స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
అలాగే ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ “జన్మాష్టమి శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ భక్తి మరియు ఆనందాల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు మరియు అదృష్టాన్ని తీసుకురావాలి. జై శ్రీ కృష్ణ” అని పేర్కొన్నారు. మరోవైపు శుక్రవారం తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. దేశవ్యాప్తంగా శ్రీ కృష్ణ మందిరాలలో మరియు ఇస్కాన్ ఆధ్వర్యంలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY