దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 16,135 పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 4, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,18,564 కు చేరుకుంది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.85 శాతంగా నమోదైంది. అలాగే గత 24 గంటల్లో కరోనాతో 24 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,25,223 కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో 1,13,864 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.53 శాతం:
దేశంలో ప్రస్తుతం 1,13,864 (0.26%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 13,958 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,28,79,477 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.53 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. ఇక జూలై 3, ఆదివారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 86.39 కోట్లకు (86,39,99,907) చేరుకుంది. జూలై 3న 3,32,978 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY