దేశంలో కరోనా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో మొత్తం 1,93,051 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 188 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.1 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,79,319 కు చేరుకుంది. కరోనా వలన మరో 3 మరణాలు (కేరళలో రికాంసైల్డ్ 3) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 530710కి పెరిగింది. అలాగే 201 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,41,46,055కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.
కాగా ప్రస్తుతం దేశంలో 2,554 (0.01%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే కేసులు కొంత ఎక్కువుగా నమోదు అయ్యాయి. అయితే ఏ రాష్ట్రంలో కూడా 100 పైన కరోనా కేసులు నమోదవలేదు.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 4 రాష్ట్రాలివే (జనవరి 4 (8am)–జనవరి 5 (8am)):
- కేరళ – 58
- కర్ణాటక – 34
- మహారాష్ట్ర – 16
- తమిళనాడు – 12.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE