దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. వరుసగా మూడోరోజు కూడా దేశంలో 18 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 18,840 పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 9, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,36,04,394 కు చేరుకుంది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.14 శాతంగా నమోదైంది. అలాగే గత 24 గంటల్లో కరోనాతో 43 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,25,386 కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, ఢిల్లీ, ఒడిశా, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో 1,25,028 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.51 శాతం:
దేశంలో ప్రస్తుతం 1,25,028 (0.29%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 16,104 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,29,53,980 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.51 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. ఇక జూలై 8, శుక్రవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 86.61 కోట్లకు (86,61,77,937) చేరుకుంది. జూలై 8న 4,54,778 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY