అమర్నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరద పోటెత్తడంతో పవిత్ర అమర్నాథ్ యాత్రలో గుహ సమీపంలో ఉన్న భక్తుల గుడారాలు/టెంట్లు కొట్టుకుపోయాయి. ఊహించని ఈ పరిణామంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో ఇప్పటికే 16 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రకటించగా, మరో 40 మంది వరకు గల్లంతు అయినట్టుగా అధికారులు తెలిపారు. అలాగే గుహ వద్ద చిక్కుకుపోయిన దాదాపు 15 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వెల్లడించారు. వరద సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరదల పరిస్థితులతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
మరోవైపు అమర్నాథ్ యాత్రలో కుండపోత వాన, ఆకస్మాత్తుగా వరదలు వచ్చాయన్న సమాచారం నేపథ్యంలో రాష్ట్రం నుంచి వెళ్లిన పలువురి యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల నేపథ్యంలో సీఎంఓ అధికారులు ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్తో మాట్లాడారు. అడిషనల్ రెసిడెంట్ కమిషనర్గా ఉన్న హిమాంశు కౌసిక్ను వెంటనే శ్రీనగర్కు పంపిస్తున్నట్టు సీఎంఓ కార్యాలయం వెల్లడించింది. అక్కడికి చేరుకున్నాక ఏపీ యాత్రికుల భద్రతకు అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY