దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో మొత్తం 2,25,104 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 275 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.12 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,72,913 కు చేరుకుంది. అలాగే మరో 2 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,624 కి పెరిగింది. మరో 368 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,41,37,617 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.
కాగా ప్రస్తుతం దేశంలో 4,672 (0.01%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే కేసులు కొంత ఎక్కువుగా నమోదు అయ్యాయి. అయితే ఏ రాష్ట్రంలో కూడా 100 పైన కరోనా కేసులు నమోదవలేదు. అలాగే గత 24 గంటల్లో 17 రాష్ట్రాల్లో జీరో కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 5 రాష్ట్రాలివే (డిసెంబర్ 1 (8am)–డిసెంబర్ 2 (8am)):
- కేరళ – 98
- మహారాష్ట్ర – 50
- కర్ణాటక – 41
- తెలంగాణ – 16
- తమిళనాడు – 15.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE