తెలంగాణ రాష్ట్రంలో మే 12 నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలో ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే అన్ని కార్యకలాపాలకు అనుమతి వుంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులు చేయబడ్డాయి. ప్రయాణ సమయాలను రీషెడ్యూల్ చేస్తూ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఒక ప్రకటన చేసింది. మే 12, బుధవారం నుంచి నగరంలోని టెర్మినల్ మెట్రో స్టేషన్స్ లో మొదటి రైలు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే టెర్మినల్ మెట్రో స్టేషన్స్ లో చివరి మెట్రో రైలు ఉదయం 8:45 గంటలకు ప్రారంభమవుతుందని, ఆ మెట్రో రైళ్లు ఉదయం 9:45 గంటలలోపు డెస్టినేషన్ కు చేరుకుంటాయని తెలిపారు.
#ManaMetro #MyMetroMyPride #HyderabadMetro pic.twitter.com/MMlxIONySn
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) May 11, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ