దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 39,070 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455 కు చేరుకుంది. గత 42 రోజులుగా రోజువారీ కరోనా కేసులు 50 వేల కంటే తక్కువుగానే నమోదవుతున్నాయి. ఇక కరోనాతో మరో 491 మంది మరణించడంతో, దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4,27,862 కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, అస్సాం, వెస్ట్ బెంగాల్, మిజోరాం, మణిపూర్ వంటి 10 రాష్ట్రాల్లోనే గత 24 గంటల్లో కొత్త కేసులు ఎక్కువుగా నమోదు అయ్యాయి. ఇక దేశంలో ప్రస్తుతం 4,04,958 (1.28%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరో 43,910 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,10,99,771 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.39 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.34 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 8, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 48,00,39,185
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 3,19,34,455
- కొత్తగా నమోదైన కేసులు [ఆగస్టు 7–ఆగస్టు 8 (8AM-8AM)] : 39,070
- నమోదైన మరణాలు : 491
- రికవరీ అయిన వారి సంఖ్య : 3,10,99,771
- యాక్టీవ్ కేసులు : 4,06,822
- మొత్తం మరణాల సంఖ్య : 4,27,862
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ