దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 4,184 కరోనా కేసులు, 104 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,80,067 కు చేరుకోగా, మరణాల సంఖ్య 5,15,459 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మిజోరాం, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 6,554 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,24,20,120 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.70 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 44,488 (0.10%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (మార్చి 9 (8am)–మార్చి 10 (8am)):
- కేరళ – 1,421
- మిజోరాం – 474
- మహారాష్ట్ర – 359
- ఢిల్లీ – 208
- కర్ణాటక – 181
- రాజస్థాన్ – 161
- తమిళనాడు – 147
- హర్యానా – 141
- ఉత్తర్ ప్రదేశ్ – 131
- ఒడిశా – 128
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ