పంజాబ్ రాష్ట్రంలో గత ఏడు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ మరియు శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) పార్టీలను తలదన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్టీ పీఠాన్ని కైవసం చేసుకోనుంది. 117 సీట్లున్న పంజాబ్ అసెంబ్లీలో దాదాపు 90 స్థానాల్లో ఆధిక్యం సాధించటం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో తొలిసారిగా అధికారాన్ని కైవసం చేసుకోనుంది. ఆప్ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ఘన విజయం సాధించారు. అధికార కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా, శిరోమణి అకాలీదళ్ మూడో స్థానంలో ఉంది. ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ పరాజయం అంచున నిలబడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ కూడా ఓటమి దిశగా పయనిస్తున్నారు.
కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, సుఖ్ దేవ్ సింగ్ ధిండా శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్)తో బీజేపీ కూటమి నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పంజాబ్ ఎన్నికల ఫలితాలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనా విధానాలకు ఆమోదం తెలిపాయని ఆయన డిప్యూటీ మనీష్ సిసోడియా గురువారం అన్నారు. పంజాబ్ ప్రజలు కేజ్రీవాల్ మోడల్ పాలన కావాలని బలంగా కోరుకున్నారు. రానున్న రోజుల్లో ఆప్ పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.
- మొత్తం 117 సీట్లు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో అధికారానికి కావాల్సిన మేజిక్ మార్క్ 59.
- ఆమ్ ఆద్మీ పార్టీ 90 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
- కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
- అకాలీదళ్, మిత్రపక్షాలు 7 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
- బీజేపీ కేవలం 2 స్థానాలకే పరిమతవుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ