దేశంలో రెండో విడత కరోనావ్యాక్సినేషన్ లో భాగంగా ఈ రోజు నుంచి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు కరోనా వాక్సిన్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా చెన్నైలో కరోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నారు.
“ఈ రోజు చెన్నైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో తోలి డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాను. 28 రోజుల తర్వాత 2 వ డోసు తీసుకుంటాను. అర్హత ఉన్న వారందరూ ముందుగానే వ్యాక్సిన్ వేయించుకోవాలని మరియు కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మరోవైపు ఈ రోజు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రముఖుల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఉన్నారు.
I took my first dose of COVID-19 vaccine at Government Medical College, Chennai today.
I will be taking the 2nd dose after 28 days.
I appeal to all the eligible people to get themselves vaccinated proactively and join in the fight against novel coronavirus. pic.twitter.com/mfA1xJXiGg
— Vice President of India (@VPSecretariat) March 1, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ