మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ, కరోనా మరణాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. శనివారం నాడు కూడా కొత్తగా 2854 కరోనా కేసులు, 60 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,16,236 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 49,189 కు పెరిగింది. అలాగే కొత్తగా 1,526 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 18,07,824 మంది కరోనా బాధితులు రికవరీ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో హోమ్ ఐసొలేషన్ లలో, ఆసుపత్రుల్లో 58,091 మంది చికిత్స పొందుతున్నారు. ఇక శనివారం నాటికీ మహారాష్ట్రలో 1,24,51,919 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ