ఆంధ్రప్రదేశ్ లో గతకొన్ని రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 2593 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వీటిలో 2584 మంది స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 9 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన 2593 కేసులతో కలిపి జూలై 16, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 38044 కు చేరింది. గత 24 గంటల్లో 22,304 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. మరోవైపు కరోనా వలన రాష్ట్రంలో 40 మంది మరణించారు. తూర్పు గోదావరిలో ఎనిమిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, చిత్తూరులో ఐదుగురు, కడపలో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, నెల్లూరు లో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, కర్నూల్ లో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 492 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (జూలై 16, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 38044
- కొత్తగా నమోదైన కేసులు : 2593
- నమోదైన మరణాలు : 40
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 19393
- యాక్టీవ్ కేసులు : 18159
- మొత్తం మరణాల సంఖ్య : 492
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu