బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు శనివారం నాడు ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు తోలి ఇన్నింగ్స్ లో 195 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం తోలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు తొలి రోజు ఆటముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(0) పరుగులేమి చేయకుండానే వెనుదిరగగా, అనంతరం ఆచితూచి ఆడిన శుబ్మన్ గిల్ 28 పరుగులు, చటేశ్వర్ పుజారా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలి రోజు ఆటలో ఆతిధ్య జట్టుపై భారత్ బౌలర్లు పూర్తి ఆధిపత్యం చూపించారు. ఆస్ట్రేలియా జట్టు 10 పరుగుల వద్ద ఉన్నప్పుడే ఓపెనర్ బర్న్స్ బుమ్రా బౌలింగ్ లో డకౌట్ గా వెనుతిరిగాడు. మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ (30) మార్నస్ లబుషేన్(48)తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్ లో మాథ్యూ వేడ్, స్టీవ్ స్మిత్ (0 ) వెంటవెంటనే అవుట్ అవ్వడంతో ఆస్ట్రేలియా జట్టు 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆతర్వాత ఆసీస్ జట్టులో హెడ్ (38) మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు. భారత్ బౌలర్ల విజృంభణతో మిగిలిన బ్యాట్స్ మెన్ తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టారు. భారత్ బౌలర్లలో బుమ్రా 4, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా ఒక వికెట్ పడగొట్టారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ