తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యాసంగి సీజన్ రైతుబంధు సహాయాన్ని డిసెంబర్ 28 నుంచి అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ యాసంగి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 61.49 లక్షల మంది రైతులు రైతుబంధు సహాయం పొందనున్నారు. ఈ సీజన్లో అదనంగా మరో 1.70 లక్షల మంది లబ్ది పొందనున్నారు. ముందుగా రాష్ట్రంలో రైతులకు డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు యాసంగి సీజన్ రైతుబంధు సహాయం అందించనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలని, ఇందుకు అవసరమైన రూ.7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. కాగా 27 వ తేదీ ఆదివారం కావడంతో రైతుబంధు పంపిణీని డిసెంబర్ 28 నుంచి ప్రారంభించనున్నారు. అలాగే బ్యాంకుల నుంచి రైతులు నగదు తీసుకునే సమయంలో కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి, పర్యవేక్షణ చర్యలు చేపట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ