చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వీరోచిత సెంచరీ సాధించడంతో భారత్ జట్టు పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ జట్టు 286 పరుగులకు ఆలౌట్ అయింది. స్పిన్ బౌలర్లు రాణిస్తుండంతో భారత్ బ్యాట్స్ మెన్ వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టినప్పటికీ అశ్విన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడారు. కోహ్లీ 62 పరుగుల వద్ద వెనుదిరగగా, అశ్విన్ 148 బంతుల్లో 14 ఫోర్స్, ఒక సిక్స్ సహాయంతో 106 పరుగులతో టెస్టుల్లో తన ఐదో సెంచరీని నమోదు చేశాడు. ఒకే టెస్టులో సెంచరీ సాధించడంతో పాటుగా ఐదు వికెట్లు తీసిన ఘనతను అశ్విన్ మూడో సారి సాధించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మొయిన్ అలీ నాలుగు, జాక్ లీచ్ నాలుగు వికెట్లు తీశారు.
దీంతో తోలి ఇనింగ్స్ లో లభించిన 195 పరుగుల ఆధిక్యం, రెండో ఇన్నింగ్స్ 286 పరుగులు కలిపి భారత్ జట్టు ఇంగ్లాండ్కు 482 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మరో రెండ్రోజుల ఆట మిగిలి ఉన్నప్పటికీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండడంతో భారత్ కు విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు 482 పరుగుల లక్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ