ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందడి కొనసాగనుంది. ఓవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, సోమవారం నాడు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. కాగా గత సంవత్సరంలో నిలిచిన ఈ ఎన్నికల ప్రక్రియను మళ్ళీ అక్కడినుంచే కొనసాగించే విధంగా ఎస్ఈసీ ఉత్తర్వులు వెలువరించింది. ముందుగా మార్చి 7, 2020 న మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవగా, ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన దశ(మార్చి 14,2020) వరకు పూర్తయింది. మార్చి 23, 2020న పోలింగ్ జరగాల్సి ఉండగా, రాష్ట్రంలో కరోనా పరిస్థితుల వలన మార్చి 15, 2020 న ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ఎస్ఈసీ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల పక్రియ ఏదశలో ఆగిపోయిందో మళ్ళీ అక్కడినుంచే ప్రారంభించే ఎస్ఈసీ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో మార్చి 3, 2021 న నామినేషన్ల ఉపసంహరణ దశ నుంచి ఎన్నికల పక్రియ ప్రారంభం కానుంది. మార్చి 10 న విజయనగరం, ఏలూరు, మచిలిపట్నం, గుంటూరు, ఒంగోల్, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్స్ తో పాటుగా గ్రేటర్ విశాఖపట్నం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లలో మరియు 13 జిల్లాలోని 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నారు.
ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్:
- నామినేషన్ల ఉపసంహరణ ప్రారంభం : మార్చి 2 (ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు)
- నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ : మార్చి 3 (మధ్యాహ్నం 3 గంటల వరకు)
- పోటీలో నిలిచిన అభ్యర్థులు తుది జాబితా ప్రచురణ : మార్చి 3 (మధ్యాహ్నం 3 గంటల తర్వాత)
- పోలింగ్ తేదీ: మార్చి 10 (ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు)
- రీపోలింగ్ (అవసరమైతే) : మార్చి 13 (ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు)
- ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన: మార్చి 14 (ఉదయం 8 గంటల నుంచి)
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ