తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

BJP Announced Party Candidates for Graduates MLC Elections in Telangana

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్-నల్గొండ-ఖమ్మం‌ మరియు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇటీవలే షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల వివరాలను సోమవారం నాడు ప్రకటించింది. పార్టీ తరపున వరంగల్-నల్గొండ-ఖమ్మం స్థానానికి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్.రాంచందర్ రావు పోటీ చేయనున్నట్టు వెల్లడించారు.

ఇక వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, తెలంగాణ జనసమితి (టీజేఎస్)‌ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం బరిలో ఉన్నారు. అలాగే హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ నుంచి జి.చిన్నారెడ్డి పోటీ చేస్తుండగా, టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 16 వతేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. అలాగే మార్చి 14 వ తేదీన పోలింగ్ నిర్వహించి, మార్చి 17న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 12 =