భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 3 టీ20ల సిరీస్ లో భాగంగా నేడు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాత్రి 7 గంటల నుంచి తోలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా పూర్తిస్థాయి టీ20 కెప్టెన్ గా రోహిత్ శర్మ, కోచ్ గా రాహుల్ ద్రావిడ్ తమ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు. ఇక ఈ సిరీస్ కు భారత్ జట్టులో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా లకు విశ్రాంతి ఇచ్చారు. అలాగే తర్వాత జరగనున్న టెస్టు సిరీస్ దృష్ట్యా న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీసన్ కు కూడా విశ్రాంతి కలిపించారు. టిమ్ సౌథీ న్యూజిలాండ్ కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ లో భారత్ సెమీస్ కు కూడా చేరకుండా వెనుదిరగగా, న్యూజిలాండ్ జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియాపై పరాజయం పాలై రన్నరప్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజా సిరీస్ లో ఇరు జట్లు కూడా సత్తాచాటాలని ఎదురుచూస్తున్నాయి. ఇక రెండో టీ20 రాంచిలో నవంబర్ 19న, మూడో టీ20 కోల్కతాలో నవంబర్ 21 జరగనున్నాయి.
భారత్ జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వెంకటేష్ అయ్యర్/శ్రేయాస్ అయ్యర్/రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, ఆర్.అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ సిరాజ్, యుజువేంద్ర చాహల్.
న్యూజిలాండ్ జట్టు అంచనా: టిమ్ సౌథీ (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, కైల్ జామీసన్, ఆడమ్ మిల్నే/లాకీ ఫెర్గూసన్, ఐష్ సోధి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ