ప్రముఖ సామాజికవేత్త, సంఘ సంస్కర్త, తత్వవేత్త మరియు రచయిత మహాత్మా జ్యోతిరావు (జ్యోతిబా) ఫూలే జయంతి సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా ఫూలే సామాజిక న్యాయం యొక్క ఛాంపియన్గా మరియు అసంఖ్యాక ప్రజలకు ఆశాకిరణంగా విస్తృతంగా గౌరవించబడ్డారని మరియు సామాజిక సమానత్వం, మహిళా సాధికారత మరియు విద్యను పెంపొందించడం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా మంగళవారం జ్యోతిబా ఫూలే సేవలను స్మరించుకున్నారు. ‘మహాత్మా ఫూలేకి అభివందనం. సామాజిక న్యాయం మరియు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడంలో ఆయన చేసిన గొప్ప కృషిని గుర్తుచేసుకుంటున్నాను. ఆయన ఆలోచనలు లక్షలాది మందికి ఆశను, శక్తిని ఇస్తాయి’ అని పేర్కొన్నారు.
On his birth anniversary, I bow to Mahatma Phule and recall his towering contribution to social justice and empowering the downtrodden. His thoughts give hope and strength to millions. pic.twitter.com/uCgxXNuMsj
— Narendra Modi (@narendramodi) April 11, 2023
మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. వర్ణ, లింగ వివక్షకు వ్యతిరేకంగా, దళిత, గిరిజన, బహుజన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా జ్యోతిబా ఫూలే దాదాపు రెండు వందలం ఏండ్ల క్రితమే కార్యాచరణ చేపట్టారని తెలిపారు. ఇక ఆధిపత్య విలువలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన జీవితాన్ని ధారపోసిన భారతీయ సామాజిక తత్వవేత్త, మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్పూర్తిదాయకమేనని అన్నారు. ఇక ఏపీ సీఎం జగన్ ట్విట్టర్లో.. అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారబోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే. ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యుడు. చదువులతోనే సమన్యాయం, అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు. ఆయన మార్గంలోనే మా పయనం. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు’ అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE