భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా నవంబర్ 25 నుంచి 29 వరకు కాన్పుర్ లో తొలి టెస్టు, డిసెంబర్ 3 నుంచి 7 వరకు ముంబయిలో రెండో టెస్టు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ లో తలపడే 16 మందితో కూడిన భారత్ ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. కాగా న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే భారతజట్టులో ఓ మార్పు చేసుకుంది. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కెఎల్ రాహుల్ ఎడమ తొడపై కండరాల స్ట్రెయిన్ తో న్యూజిలాండ్ తో జరగనున్న రెండు టెస్ట్ సిరీస్ కు దూరమైనట్టు బీసీసీఐ మంగళవారం నాడు ప్రకటించింది. ఇటీవల మంచి ఫామ్ లో ఉన్న కెఎల్ రాహుల్ టెస్ట్ సిరీస్ కు పూర్తిగా దూరమవడం భారత్ జట్టుకు షాక్ అనే చెప్పాలి. కాగా వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్కు సన్నాహకంగా కెఎల్ రాహుల్ ఇప్పుడు ఎన్సీఏలో పునరావాసం పొందనున్నాడని తెలిపారు.
ఇక కెఎల్ రాహుల్ స్థానంలో ఈ టెస్ట్ సిరీస్ కు ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ తెలిపింది. మరోవైపు న్యూజిలాండ్ తో జరిగే టీ20 సిరీస్ తో పాటుగా, తొలి టెస్టుకు కూడా విరాట్ కోహ్లీ విరామం తీసుకుంటున్నాడు. విరాట్ కోహ్లీ 2వ టెస్టుకు జట్టులో చేరి జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అలాగే రోహిత్ శర్మ కూడా తొలిటెస్టుకు దూరం కావడంతో, తొలిటెస్టుకు అజింక్య రహానే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు భారత జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), ఛటేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, మయాంక్ అగర్వాల్, శుబ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ