నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు డిసెంబర్ 10వ తేదీన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఖరారు చేస్తూ టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం నిజామాబాద్లో కవిత నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్ అండ్ రిటర్నింగ్ అధికారి సి.నారాయణ రెడ్డికి కవిత నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఆమెతో పాటుగా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కూడా పాల్గొన్నారు. మరోవైపు ఈ స్థానంలో సరిపడా బలం లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటీకి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఎమ్మెల్సీ స్థానంలో నామినేషన్ల దాఖలుకు నవంబర్ 23, మంగళవారమే చివరిరోజు కావడంతో, ఇతరులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకుంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ