హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం భారత్, జింబాబ్వే జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. ముందుగా భారత్ జట్టు టాస్ గెలవగా కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే 40.3 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. జింబాబ్వే ఆటగాళ్లలో కెప్టెన్ చాకబువా (35), నంగార్వ(34), బ్రాడ్ ఎవాన్స్ (33) పరుగులతో రాణించారు. భారత్ బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్స్ అంతా వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టారు. దీపక్ చాహర్ మ్యాచ్ ప్రారంభంలోనే ప్రభావం చూపి 3 వికెట్స్ తీశాడు. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్ చెరో మూడు వికెట్లు, మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఇక 190 పరుగుల లక్ష్య ఛేదనకై బరిలో దిగిన భారత్ జట్టు వికెట్ నష్టపోకుండానే 30.5 ఓవర్లలో 192 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (81), శుభ్మన్గిల్ (82) జింబాబ్వే బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొని పరుగులు సాధించడంతో భారత్ ఖాతాలో ఘన విజయం నమోదైంది. ఈ మ్యాచ్ లో విజయంతో భారత్ జట్టు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ తోలి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. అలాగే ఈ మ్యాచ్ లో రాణించిన దీపక్ చాహర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇక ఇరుజట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ ఆగస్టు 20, శనివారం నాడు జరగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY