ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క నగదు పొందేందుకు లబ్ధిదారులైన రైతులకు కేంద్రప్రభుత్వం 2022-23 ఆర్ధిక సంవత్సరం నుంచి ఈ-కేవైసీని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ముందుగా ఈ-కేవైసీ పూర్తిచేసేందుకు మార్చి 31, 2022 వరకు గడువు పెట్టగా, ఆ తర్వాత మే 31, 2022 వరకు, అనంతరం జూలై 31, 2022 వరకు పొడిగిస్తునట్టు కేంద్రం ప్రకటించింది. ఇంకా దేశవ్యాప్తంగా కొంతమంది రైతులు ఈ-కేవైసీని పూర్తి చేయాల్సి ఉండడంతో పీఎం-కిసాన్ ఖాతా ఈ-కేవైసీని పూర్తిచేసేందుకు తాజాగా ఆగస్టు 31 వరకు గడువును పొడిగించారు. ఆ వివరాలను పీఎం-కిసాన్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
“పీఎం-కిసాన్ నమోదిత రైతులకు ఈ-కేవైసీ తప్పనిసరి. పీఎంకిసాన్ పోర్టల్లో ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ కోసం సమీపంలోని సీఎస్సీ కేంద్రాలను సంప్రదించవచ్చు. పీఎం-కిసాన్ లబ్ధిదారులందరికీ ఈ-కేవైసీ గడువు ఆగస్టు 31, 2022 వరకు పొడిగించబడింది” అని ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటివరకు పీఎం-కిసాన్ కింద 11వ విడతల నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. కాగా పీఎం-కిసాన్ 12వ విడత నిధులు సెప్టెంబర్ 1వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
పీఎం-కిసాన్ కోసం ఈ-కేవైసీ ప్రక్రియ:
- పీఎం కిసాన్ వెబ్ సైట్ ను http://pmkisan.nic.in/ని సందర్శించి, ఫార్మర్స్ కార్నర్ విభాగం కింద ‘ఈ-కేవైసీ’పై క్లిక్ చేయాలి.
- అనంతరం ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ పేజీలో ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి, సెర్చ్ బటన్ పై క్లిక్ చేయాలి.
- ఆధార్ నెంబర్ కనిపించాక, ఆధార్తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి, గెట్ ఓటీపీ బటన్ పై క్లిక్ చేయాలి.
- మొబైల్ నంబర్ కు వచ్చిన నాలుగు అంకెల ఓటీపీని ఎంటర్ చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
- అనంతరం ఆధార్ రిజిస్టర్డ్ ఓటీపీ ఆప్షన్ లో క్లిక్ చేసాక మొబైల్ నెంబర్ కు వచ్చిన మరో ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈ-కేవైసీ విజయవంతంగా పూర్తవుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY