అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలీదు. కొన్నిసార్లు అనుకోకుండా లక్ష్మీదేవి వచ్చి ఇంటి తలుపు కొడుతుంది. ఇంకొన్నిసార్లు కావాలని ఎదురుచూసినా.. మనవైపు కన్నెత్తి కూడా చూడదు. అలాంటి అనుకోని అదృష్టమే వరించింది ఓ భారతీయుడిని. దేశం కానీ దేశంలో లాటరీలో జాక్ పాట్ కొట్టాడు. ఐతే.. అతను ఏళ్ల తరబడి లాటరీ టికెట్స్ కొంటూ.. బహుమతి కోసం ఎదురుచూడలేదు. ఏదో క్యాజువల్గా లాటరీ టికెట్ కొంటే.. ఊహించని విధంగా అతడిని లక్ష్మీదేవి వరించింది.
దుబాయిలోని డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్లో భారతీయుడు జాక్పాట్ కొట్టాడు. భారతీయ వ్యక్తి వినయ్ శ్రీకర్ చోడంకర్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్లో 1 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 8.20 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో వినయ్ శ్రీకర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. బుధవారం నిర్వహించిన లక్కీ డ్రాలో జూన్ 30వ తారీఖున ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్ నెం. 3588కు జాక్పాట్ తగిలింది. ముంబైకి చెందిన వినయ్ శ్రీకర్ జూన్ 30న దుబాయి నుంచి సౌదీ అరేబియాలోని తబుక్కు జర్నీ చేస్తున్న సమయంలో ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అలా ప్రయాణం చేస్తున్న సమయంలో సరదాగా కొన్న లాటరీ టికెట్ అతడికి కోట్లు తెచ్చిపెట్టింది.
బుధవారం నిర్వహించిన డ్రాలో వినయ్ శ్రీకర్ టికెట్కు లాటరీ తగలడంతో నిర్వాహకులు అతడి ఫోన్ నంబర్కు కాల్ చేశారు. కానీ, కలవలేదు. దాంతో ఇతర మార్గాల్లో అతనికి ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అండ్ సీఈఓ కోల్మ్ మెక్లౌగ్లిన్ వెల్లడించారు. ఇక 1999లో ప్రారంభమైన దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్లో ఇప్పటివరకూ 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న భారతీయుల్లో వినయ్ శ్రీకర్ 212వ వ్యక్తి. కాగా.. ఈ డ్యూటీ ఫ్రీ రాఫెల్ టికెట్ల కొనుగోలుదారుల్లో అత్యధికులు భారతీయులేనని రాఫెల్ నిర్వాహకులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE