తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా కే.లక్ష్మణ్ స్థానంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను బీజేపీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 28, బుధవారం నాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కీలక నేతల సమక్షంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్షుడిగా ఆయన నియామకం కొన్ని నెలల క్రితమే జరిగింది. ఆ తర్వాత అనేక సార్లు పనులు నిమిత్తం పార్టీ కార్యాలయానికి వచ్చినప్పటికీ లాక్డౌన్ నేపథ్యంలో పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు చేపట్టలేదు. దీంతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు, రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలైన కే.లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్, మోత్కుపల్లి నరసింహులు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, తదిరుల సమక్షంలో ఈ రోజు బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu