ఐపీఎల్-2022లో భాగంగా ఏప్రిల్ 24, ఆదివారం రాత్రి ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ టీ20 మ్యాచులో స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు గానూ లక్నో సూపర్ జెయింట్స్ కు జరిమానా విధించినట్టు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. మినిమమ్ ఓవర్ రేట్ ఉల్లంఘనలకు సంబంధించి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఈ తప్పిదం చేయడం రెండవ సారి అని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కు 24 లక్షల జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇక జట్టులో ప్లేయింగ్ ఎలెవన్లోని మిగిలిన సభ్యులకు రూ.6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం ఏది తక్కువైతే అది జరిమానాగా విధించబడుతుందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ