ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో COVID-19 కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్లో ఐదు కేసులు నమోదయ్యాయి. తాజా సమాచారం మేరకు పరీక్షలో పాజిటివ్ వచ్చిన తర్వాత మిచెల్ మార్ష్ ఆసుపత్రిలో చేరాడు. దీంతో బుధవారం పంజాబ్ కింగ్స్తో జరగనున్న ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ పుణె నుండి ముంబైకి మార్చబడింది. ముంబై లోని బ్రబౌర్న్ స్టేడియంలో జరుగనుంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మంగళవారం ఒక పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించింది. బీసీసీఐ తన మెయిల్లో COVID-19 కోసం పాజిటివ్ పరీక్షించిన ఢిల్లీ క్యాపిటల్స్ బృందంలోని ఐదుగురు సభ్యుల పేర్లను కూడా జాబితా చేసింది.
వీరిలో పాట్రిక్ ఫర్ హార్ట్ – ఫిజియోథెరపిస్ట్, చేతన్ కుమార్ – స్పోర్ట్స్ మసాజ్ థెరపిస్ట్, మిచెల్ మార్ష్ – ప్లేయర్, డాక్టర్ అభిజిత్ సాల్వి – టీమ్ డాక్టర్ మరియు ఆకాష్ మానే – సోషల్ మీడియా కంటెంట్ టీమ్ మెంబర్. పూణెలోని MCA స్టేడియం మొదట మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది, కానీ ఇప్పుడు అది బ్రబౌర్న్ స్టేడియంకు మార్చబడింది. దీనిని ఢిల్లీ క్యాపిటల్స్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. కాగా జట్టు సభ్యులందరినీ ఐసోలేషన్లో ఉంచామని, టీమ్ లోని అందరికీ బుధవారం ఉదయం మరోసారి RT-PCR పరీక్షను నిర్వహిస్తామని జట్టు యాజమాన్యం పేర్కొంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ ద్వారా మళ్ళీ విజయం సాధించాలని చూస్తున్నారు. పంజాబ్ తమ చివరి గేమ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ