బీబీసీకి షాక్.. ఢిల్లీ, ముంబై కార్యాలయాలపై ఐటీ శాఖ కీలక సర్వే, పన్నుల అవకతవకల ఆరోపణలపై చర్యలు

IT Department Carries Out Survey as Part of Tax Evasion Investigation on BBC’s Delhi and Mumbai Offices Today,IT Department Carries Out Survey,Tax Evasion Investigation on BBC,BBC’s Delhi and Mumbai Offices,Mango News,Mango News Telugu,Bbc Documentary,Bbc Cricket India,Bbc Documentary On Modi,Bbc Hausa Indiya,Bbc Hindi,Bbc India Correspondent,Bbc India Hindi,Bbc India Weather Report,Bbc Indian Sportswoman Of The Year 2021,Bbc Indian Sportswoman Of The Year 2022,Bbc Indian Variant,Bbc Iplayer India,Bbc News,Bbc News India,Bbc News India Hindi,Bbc Sport Cricket England V India,Bbc Studios India,Bbc Urdu India,Bbc Weather India,Modi Bbc Documentary,Narendra Modi Bbc Documentary India

ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)కి షాక్ ఇచ్చింది. బీబీసీకి చెందిన ఢిల్లీ మరియు ముంబై కార్యాలయాలపై పన్ను ఎగవేత దర్యాప్తులో భాగంగా ఐటీ శాఖ ఈరోజు సర్వే నిర్వహించింది. ఈ మేరకు మంగళవారం దాదాపు 15 మంది ఐటీ అధికారుల బృందం ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. అంతర్జాతీయ పన్నులు మరియు బదిలీ ధరల అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై బీబీసీ కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. సంస్థ యొక్క వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలు మరియు దాని భారతీయ విభాగానికి సంబంధించిన పత్రాలను విభాగం పరిశీలిస్తోందని వెల్లడించాయి.

అయితే ప్రస్తుతానికి సర్వేలో భాగంగా, ఐటీ శాఖ కేవలం కంపెనీ బీబీసీ ప్రాంగణంలో మాత్రమే సర్వే చేయనుంది. దాని ప్రమోటర్లు మరియు డైరెక్టర్ల నివాసాలు సహా ఇతర కార్యాలయాలపై ఎలాంటి దాడులు చేయట్లేదని తెలుస్తోంది. ఒకవేళ సర్వేలో ఏదైనా అవకతవకలను గుర్తించినట్లయితే తదుపరి చర్యలు ఉంటాయని ఐటీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక అందుతోన్న సమాచారం ప్రకారం, ఐటీ అధికారులు బీబీసీ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారిని ప్రాంగణాన్ని ఖాళీ చేసి ఇంటికి వెళ్లాలని కోరారు. దీనిలో భాగంగా బీబీసీ యొక్క ఢిల్లీ కార్యాలయంలో మధ్యాహ్నం షిఫ్ట్‌లో పని చేసే వారిని ఇంటి నుండి పని చేయమని సూచించినట్లు తెలుస్తోంది. కాగా 2002 గుజరాత్ అల్లర్లు మరియు భారతదేశంపై బ్రాడ్‌కాస్టర్ రెండు భాగాల డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం జరగడం గమనార్హం.

ఈ డాక్యుమెంటరీపై కేంద్రం తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి రెండు ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ కు ఆయా లింకులు తొలగించాల్సిందిగా కోరినట్లు కూడా వార్తలొచ్చాయి. ఇక ఇదిలావుండగా, ఐటీ అధికారులు బీబీసీ కార్యాలయాలకు చేరుకోవడంపై కాంగ్రెస్ స్పందించింది. అదానీ విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని మేము డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం మాత్రం బీబీసీ కార్యాలయాలపై దాడులు చేయడానికే ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ బీబీసీ కార్యాలయాలలో ఐటీ అధికారులు చేరుకొని సిబ్బందిని ప్రశ్నిస్తున్న వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =