తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే నేడు (ఫిబ్రవరి 14, మంగళవారం) మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో రెండు రోజుల పాటుగా పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా బుధవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వైస్ ప్రెసిడెంట్లతో రాష్ట్రంలో జరుగుతున్న ‘హాత్ సే హాత్ జోడో’ యాత్రపై రివ్యూ నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 14, మంగళవారం షెడ్యూల్:
- 02.55 గంటలు : నాగపూర్ నుంచి హైదరాబాద్ కు ప్రయాణం ప్రారంభం
- 04.40: రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ కు చేరిక
- 05.30: ఎమ్మెల్యే క్వార్టర్స్ కు చేరిక
- 06.30-07.00: – ఇటీవల మరణించిన టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సింధు శంకర్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు పరామర్శ
- 08.00: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ రావు కుమార్తె వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరు
మంగళవారం రాత్రికి హైదరాబాద్లో బస
ఫిబ్రవరి 15, బుధవారం షెడ్యూల్:
- 11.30-12.30: ఎస్టీ డిపార్ట్మెంట్ చైర్మన్, ఇంచార్జ్, జిల్లా అధ్యక్షులు, స్టేట్ ఆఫీస్ బేరర్స్ తో సమావేశం
- 12.30-01.30: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్లతో ‘హాత్ సే హాత్ జోడో’ యాత్రపై రివ్యూ
- 01.30-02.30: రిజర్వేడ్
- 02.30-03.30: కిసాన్ కాంగ్రెస్ చైర్మన్, ఇంచార్జ్, జిల్లా అధ్యక్షులు, స్టేట్ ఆఫీస్ బేరర్స్ తో సమావేశం
- 04.00-07.00: రిజర్వేడ్
- బుధవారం రాత్రికి హైదరాబాద్లో బస
- ఫిబ్రవరి 16న నాగపూర్ కు ప్రయాణం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE