జమ్ముకశ్మీర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం పూంచ్ వద్ద ఒక మినీ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 25మంది గాయపడ్డారు. వీరిలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. 36 మంది ప్రయాణికులతో కూడిన ఈ మినీ బస్సు గలీ మైదాన్ నుండి పూంచ్కు వెళ్తుండగా ఉదయం 8.30 గంటలకు సావ్జియాన్ సరిహద్దు బెల్ట్లోని బ్రారీ నల్లా సమీపంలో ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న బస్సు ఒక మలుపు వద్ద అదుపు తప్పడంతో బరారి నల్లా సమీపంలో లోయలో పడిపోయిందని వారు పేర్కొన్నారు. కాగా ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారని వెల్లడించారు. కాగా గాయపడిన వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. సహాయక చర్యల్లో ఆర్మీ కూడా పాల్గొన్నట్లు తెలిపారు.
ఇక బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. పూంచ్ బస్సు ప్రమాదంపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ నిన్హా స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన, వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఇంకా జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా మరియు మెహబూబా ముఫ్తీలతో సహా వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా ప్రాణ నష్టం పట్ల సంతాపం వ్యక్తం చేశారు మరియు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY