దేశంలో కరోనా మహమ్మారి పూర్తి అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 625 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,62,141 కు చేరుకుంది. దేశంలో 2020, ఏప్రిల్ 09 (540) తర్వాత మళ్ళీ అతి తక్కువ కేసులు (625) నమోదవడం ఇదే. ముఖ్యంగా గత 24 గంటల్లో కేరళ (129), తమిళనాడు (109), మహారాష్ట్ర (91), కర్ణాటక (78) వంటి 4 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. అలాగే కరోనా వలన గత 24 గంటల్లో కొత్తగా ఎలాంటి మరణాలు నివేదించబడలేదు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,30,509 గా ఉంది. అయితే మార్చి 2020 నుండి 24 గంటల వ్యవధిలో ఎటువంటి కరోనా మరణాలు నమోదు కాకపోవడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 14 వేలుకుపైగా (14021 (0.03%)) యాక్టీవ్ కేసులు ఉన్నాయి..
మరోవైపు కొత్తగా 1,119 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,41,17,611 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.78 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద నవంబర్ 8, మంగళవారం ఉదయం 7 గంటల వరకు 219.74 కోట్లకుపైగా (2,19,74,51,758) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE