జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ-మెయిన్) 2023 పరీక్షలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి ఎన్టీఏ దీనికి సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు కోసం చివరి తేదీ జనవరి 12, 2023. పరీక్షా కేంద్రాలను జనవరి రెండవ వారంలో ప్రకటించనున్నారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్సైట్లు jeemain.nta.nic.in మరియు nta.nic.inల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, అలాగే జనవరి మూడవ వారంలో హాల్ టిక్కెట్ల (అడ్మిట్ కార్డ్)ను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ సూచించింది. దరఖాస్తు చేయడంలో ఎవరైనా అభ్యర్థులు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే, వారు 011 – 40759000 / 011 – 69227700 నంబరుకి కాల్ చేయడం లేదా, [email protected]కి ఈ-మెయిల్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని సూచించింది.
ఇక తొలివిడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష 2023-24 విద్యా సంవత్సరానికి గానూ ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికి జనవరి 26 రిపబ్లిక్ డే మినహా జనవరి 24-31 వరకు నిర్వహించబడుతుందని, జేఈఈ-మెయిన్ 2023 యొక్క రెండవ సెషన్ ఏప్రిల్ 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరుపనున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ లో జరుగనున్న చివరి విడత పరీక్షలకు ఫిబ్రవరి 7నుంచి మార్చి 7వరకు దరఖాస్తులు సమర్పించడానికి అనుమతి ఇచ్చారు. కాగా జేఈఈ-మెయిన్ 2023 పరీక్ష ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు మరియు ఉర్దూ సహా మొత్తం 13 భాషలలో నిర్వహించనున్నారు. ఇక ఈ పరీక్షలను తెలుగు రాష్ట్రాలలో.. తెలంగాణలో 17 కేంద్రాలు, ఏపీలో 26 కేంద్రాలలో నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ