తమిళనాడు రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, అన్నాడీఎంకే పొత్తుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. ఆదివారం నాడు మధురైలో నిర్వహించిన బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ, అన్నాడీఎంకే పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని, రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని ప్రకటించారు. ఒకరోజు పర్యటనలో భాగంగా మధురై చేరుకున్న జేపీ నడ్డా ముందుగా పార్టీ కోర్ కమిటీ సమావేశానికి హాజరై ఎన్నికల సన్నద్ధతపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఆ తరువాత పార్టీ సోషల్ మీడియా వాలంటీర్లతో కూడా మాట్లాడి కీలక సూచనలు చేశారు.
గత నవంబర్ లో అమిత్ షా చెన్నై పర్యటన సందర్భంగానే రాష్ట్రంలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీతో అన్నాడీఎంకే పొత్తు కొనసాగుతుందని అన్నాడీఎంకే నేత, తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ప్రకటన చేశారు. తాజాగా జేపీ నడ్డా కూడా ప్రకటన చేసి ఇరుపార్టీల పొత్తుపై పూర్తి స్పష్టత ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ