కరోనా వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021 నూతన సంవత్సరం వేడుకలుపై ఆంక్షలు విధిస్తూ శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్రంలో క్లబ్లు, పబ్బులు, రెస్టారెంట్లు మరియు నృత్య కార్యక్రమాలు సహా ప్రజలు సమావేశమయ్యే పలు ఇతర ప్రదేశాలలో కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నిషేధం డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు నాలుగు రోజుల పాటుగా అమల్లో ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. అయితే పబ్బులు, క్లబ్బులు మరియు రెస్టారెంట్లలో సాధారణ కార్యకలాపాలను సాధారణ పద్ధతిలో నిర్వహించడానికి ఎటువంటి పరిమితులు ఉండవని పేర్కొన్నారు. అలాగే క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రజలు షేక్ హాండ్స్ ఇచ్చుకోవడం మరియు ఆలింగనాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని క్రిస్మస్ మరియు నూతన సంవత్సరాన్ని సింపుల్ గా జరుపుకోవలసిన అవసరం ఉందని ప్రభుత్వం పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ