కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా కేసులు కలిగిన రాష్ట్రాలైన మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు మరియు మధ్యప్రదేశ్ నుంచి వచ్చే రైళ్లు, ఇతర వాహనాలను రాష్ట్రంలోకి అనుమతించబోమని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఈ రాష్ట్రాల నుంచి వచ్చే విమానాలు సంఖ్య తగ్గించాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖను విజ్ఞప్తి చేసింది. మే 28, గురువారం నాడు సమావేశమైన రాష్ట్ర కేబినెట్ కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకునట్టు వెల్లడించారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎక్కువ మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలుతుందని, ఈ నేపథ్యంలో వారిని ప్రభుత్వ క్వారంటైన్ చేయడంలో సమస్యలు తలెత్తడంతోనే కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
మే 25 వ తేదీ నుంచి దేశీయ విమాన సేవలు ప్రారంభమైన క్రమంలోనే మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు మరియు మధ్యప్రదేశ్ నుంచి వచ్చే విమాన ప్రయాణికులు తప్పనిసరిగా 7 రోజుల పాటు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ లో ఉండాల్సిందేనని ప్రకటించారు. అయితే తాజాగా 5 రాష్ట్రాలకు చెందిన ప్రజల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu