తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నూతన చైర్మన్ గా ప్రొఫెసర్ లింబాద్రి నియమితులయ్యారు. ఇప్పటివరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ గా వ్యవహరించిన తుమ్మల పాపిరెడ్డి పదవీకాలం ముగిసింది. దీంతో ప్రస్తుతం ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్-1గా, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్గా కొనసాగుతున్న ప్రొఫెసర్ లింబాద్రికి నూతన అఫిషియేటివ్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు లింబాద్రి చైర్మన్ గా కొనసాగుతారని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం నాడు విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు చైర్మన్ గా నియమితులైన అనంతరం లింబాద్రి ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ను కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రొఫెసర్ లింబాద్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ