కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 4,972 కరోనా కేసులు, 57 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 51,09,674 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 38,045 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 5,978 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 50,18,279 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 52,710 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక తిరువనంతపురం జిల్లాలో అత్యధికంగా 7253 యాక్టీవ్ కేసులు ఉండగా, కోజికోడ్ లో 7095, ఎర్నాకులంలో 6726, త్రిస్సుర్ లో 5442, కొట్టాయంలో 4871, కొల్లంలో 3807 కేసులు ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాటికి కేరళలో 3,93,50,510 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ