కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 52,199 కరోనా కేసులు, 29 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 61,29,755 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 56,100 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 41,715 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 56,95,091 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 3,77,823 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 71599 యాక్టీవ్ కేసులు ఉండగా, తిరువనంతపురంలో 44435, త్రిస్సుర్ లో 40068, కొల్లంలో 31425, కోజికోడ్ లో 31128, కొట్టాయంలో 28330, పాలక్కాడ్ లో 23428, మలప్పురంలో 23422, అలపుజాలో 20026, ఇడుక్కిలో 18270, పతనంతిట్టలో 15380, కన్నూర్ లో 14399 కేసులు ఉన్నాయి. మరోవైపు బుధవారం నాటికి కేరళలో 4,41,87,555 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ