సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. ఒక సీఎం అయి ఉండి మన రాజ్యాంగాన్ని అవమానించడం కేసీఆర్ కు తగదన్నారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో.. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపడతామని సంజయ్ తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు అంబేద్కర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలకు హాజరవుతారని, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఆయా కార్యక్రమాలకు రారని విమర్శించారు.
ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు దళితుడిని సీఎంని చేస్తానని కేసీఆర్ చెప్పారని బండి సంజయ్ గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఆ మాట మరిచారని సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో రాష్ట్రంలో 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. తర్వాత ఇప్పుడెందుకు ఆ హామీ నిలబెట్టుకోవడంలేదని ప్రశ్నించారు బండి సంజయ్. ఎస్సీగా ఉన్న డిప్యూటీ సీఎంను మార్చారని విమర్శించారు సంజయ్. దళిత రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు సంజయ్. బాబా సాహేబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చింది బీజేపీయేనని అన్నారు బండి సంజయ్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF