ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ విషయమై ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే రాష్ట్ర జిల్లా కేంద్రాలలో రిలే నిరాహార దీక్షల ద్వారా తమ నిరసనను తెలుపుతున్నారు ఉద్యోగులు. ఈ నేపథ్యంలో.. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నేతలు ‘ఛలో విజయవాడ’ ఆందోళనకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వేల మంది ఉద్యోగులు ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి రావాలని సమితి నేతలు పిలుపునిచ్చారు. బీఆర్టీఎస్ రోడ్ లో నిర్వహించ తలపెట్టిన ఈ ర్యాలీకి వారు పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఏపీ పోలీసులు దీనికి అనుమతి నిరాకరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున పోలీసులు ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. కోవిడ్ ఆంక్షల కారణంగా సామూహిక సమావేశాలపై నిషేధం విధించబడిందని పోలీసు అధికారులు తెలిపారు.
‘ఛలో విజయవాడ’ నేపథ్యంలో.. విజయవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉద్యోగులు కార్యక్రమానికి హాజరుకావద్దని.. అందరూ సురక్షితంగా ఉండాలని పోలీసులు తెలిపారు. కరోనా మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా, సంఘ వ్యతిరేక వ్యక్తులు సమావేశాల్లోకి ప్రవేశించి శాంతిభద్రతల సమస్యలను సృష్టించే అవకాశం ఉన్నందున ఉద్యోగులెవరూ ఈ కార్యక్రమానికి విజయవాడకు రావద్దని విజయవాడ పోలీసు కమిషనర్ తెలిపారు. అలాగే, విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు కమిషనర్. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో వాహనాలను నిషేధించారు. ప్రజలందరూ ఈ నిబంధనలు పాటించి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ