కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 5,754 కరోనా కేసులు, 49 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 50,89,849 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 37,051 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 6,489 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 49,90,817 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 61,348 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక తిరువనంతపురం జిల్లాలో అత్యధికంగా 8986 యాక్టీవ్ కేసులు ఉండగా, ఎర్నాకులంలో 7870, కోజికోడ్ లో 7455, త్రిస్సుర్ లో 6193, కొట్టాయంలో 5448, కొల్లంలో 4577 కేసులు ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాటికి కేరళలో 3,91,30,726 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ