వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నీసా (56) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురై, గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్టుగా కుటుంబసభ్యులు తెలిపారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీకోసం శ్రమించిన కరీమున్నీసాకు గత మార్చిలోనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా సీఎం వైఎస్ జగన్ అవకాశం కల్పించారు. శుక్రవారం జరిగిన శాసనమండలి సమావేశాలకు కూడా ఆమె హాజరయ్యారు. సమావేశాల అనంతరం విజయవాడలోని నివాసానికి చేరుకున్న ఆమె, రాత్రి 11 గంటల సమయంలో ఛాతీనొప్పితో అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు వెంటనే హుటాహుటిన విజయవాడలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూశారు. కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు.
ఎమ్మెల్సీ కరీమున్నీసా మరణం పట్ల సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “నా సోదరి మహ్మద్ కరీమున్నీసా ఆకస్మిక మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నిన్న శాసనమండలికి హాజరై రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడం చాలా బాధాకరం. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. వారికి నాతో సహా పార్టీ అండగా ఉంటుంది” అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ