కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 8850 కరోనా కేసులు, 149 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47,29,056 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 25,526 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 17,007 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 45,74,206 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,28,736 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 20277 యాక్టీవ్ కేసులు ఉండగా, తిరువనంతపురంలో 15995, కోజికోడ్ లో 13660, మలప్పురంలో 11392, కొల్లంలో 11137, త్రిస్సుర్ లో 9560, పాలక్కాడ్ లో 8067, పతనంతిట్టలో 7613, అలప్పూజాలో 6446 కేసులు ఉన్నాయి. మరోవైపు సోమవారం నాటికి కేరళలో 3,56,81,666 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ