ముంబయి సమీపంలో సముద్రంపై ఓ క్రూజ్ షిప్ లో జరుగుతున్న రేవ్ పార్టీ వ్యవహారంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సహా మరో ఏడుగురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో ముంబయి కోర్టు సోమవారం నాడు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ నిరాకరించింది. ఆర్యన్ ఖాన్ తో పాటుగా మరో ముగ్గురిని అక్టోబర్ 7వరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో విచారణ అనేది ప్రధాన ప్రాముఖ్యత కలిగివుందని, దానిని నిర్వహించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. ఈ విచారణ నిందితులకు మరియు ఇన్వెస్టిగేటర్స్ కు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు.
ముందుగా కోర్టు విచారణ సందర్భంగా ఎన్సీబీ తరఫున ఏఎస్జీ అనిల్ సింగ్, ఆర్యన్ ఖాన్ తరఫున సతీశ్ మనేశిందే వాదనలు వినిపించారు. విచారణలో ఆర్యన్ ఖాన్ను ప్రశ్నించడానికి అక్టోబర్ 11 వరకు కస్టడీకి ఇవ్వాలని ఎన్సీబీ కోరింది. కాగా విచారణ అనంతరం అక్టోబర్ 7 వరకు మాత్రమే ఎన్సీబీ కస్టడీకి అనుమతి ఇస్తూ ముంబయి సిటీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ సందర్భంగా తల్లిదండ్రులు షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్ లు కోర్టుకు హాజరు కాలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ