కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 13,834 కరోనా కేసులు, 95 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,94,692 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 25,182 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 13,767 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 45,26,429 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,42,499 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 22619 యాక్టీవ్ కేసులు ఉండగా, తిరువనంతపురంలో 16063, కోజికోడ్ లో 14920, కొల్లంలో 12921, మలప్పురంలో 12903, త్రిస్సుర్ లో 10345, పాలక్కాడ్ లో 8906, పతనంతిట్టలో 8582, అలప్పూజాలో 7695 కేసులు ఉన్నాయి. మరోవైపు శనివారం నాటికి కేరళలో 3,54,21,046 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ