కేరళ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 95,218 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 41,668 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 43.76 శాతంగా నమోదైంది. అలాగే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55,52,512 కు చేరుకుంది. ఇక కొత్తగా కరోనాకు చికిత్స పొందుతూ మరో 33 మంది మరణించినట్టు తెలిపారు.
అలాగే కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం 73 మరణాలను ప్రకటించారు. దీంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 51,607 కి పెరిగింది. కొత్తగా కరోనా నుంచి 17,053 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 52,76,647 కు చేరుకుంది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 2,23,548 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF